Visakha Mlc Election : విశాఖ ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే.

Update: 2024-08-14 14:32 GMT

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ నామినేషన్ ఒక్కటే మిగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా బరిలోకి దిగకకపోవడంతో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు.

తన నామినేషన్ ను...
ఈరోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కానున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఒక్కరే అభ్యర్థిగా మిగిలారు. దీంతో అధికారులు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేపు ప్రకటించే అవకాశాలున్నాయి


Tags:    

Similar News