YSRCP : గుంటూరులో వైసీపీకి మరో షాక్

గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. నేతలు వరసబెట్టి వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు.

Update: 2024-09-21 06:37 GMT

 ysrcp mla

గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. నేతలు వరసబెట్టి వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు రాజీనామా చేయగా మరికొందరు నేతలు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఎక్కువ మంది నేతలు జనసేన వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు.

నలుగురు కార్పొరేటర్ల రాజీనామా...
తాజాగా ఈరోజు వైసీపీ కార్పొరేటర్లు రాజీనామా చేశారు. మొత్తం నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశఆరు. 8, 13, 18, 56 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు రాజీనామా చేశారు. గత ఎన్నికలలో వీరంతా వైసీీపీ నుంచి గెలిచారు. ఈ నలుగురు కార్పొరేటర్లు త్వరలోనే జనసేనలో చేరుతున్నారని తెలిసింది.


Tags:    

Similar News