మరోసారి రోజా ఫైర్.. అదే జరిగితే?

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తన పార్టీలోని ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

Update: 2021-12-31 08:23 GMT

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తన పార్టీలోని ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. వైసీపీ పేరు చెప్పి కొందరు అధికారులను బెదిరిస్తున్నారని రోజా ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అధికారులను బెదిరిస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు.

ఊరుకునేది లేదు.....
ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళతానని రోజా తెలిపారు. పార్టీ పేరు చెప్పుకుని ఎవరైనా వసూళ్లకు పాల్పడినా, అధికారులను బెదిరించినా ఊరుకునే ప్రసక్తి లేదని రోజా తెలిపారు. అటువంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.


Tags:    

Similar News