AP HighCourt: వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు కీలక సూచనలు చేసింది

Update: 2024-07-11 06:49 GMT

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో వైసీపీ నేతలు సజ్జల, తలశిల, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు పవన్, భాగ్యరాజ్, సుధాకర్​ను అరెస్టు చేశారు. వారు ముగ్గురూ కృష్ణలంకకు చెందిన వారు. వారు ముగ్గురు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్రం కార్యాలయంపై 2021, అక్టోబర్ 19న కొందరు దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీ, టోల్ ప్లాజా వద్ద సేకరించిన సమాచారంతో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించారు. పలువురు వైసీపీ కీలక నేతలపై కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News