హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది.

Update: 2022-07-26 12:28 GMT

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది. ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. హైటెక్ సిటీ వద్ద ఈ ఘటన చోట చేసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లా వాసులుగా...
హైటెక్ సిటీ వద్ద ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతులంతా వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రాజప్ప, శ్రీను, కృష్ణగా పోలీసులు మీడియాకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News