Road Accident : కాకినాడలో బైకును ఢీకొన్న కారు.. అక్కడిక్కడే ఇద్దరి మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడలో ఒక కారు బైకును వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు.

Update: 2024-07-21 04:01 GMT

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడలో ఒక కారు బైకును వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. కాకినాడలోని కల్పనా సెంటర్ లో వేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో మద్యం సీసాలున్నట్లు పోలీసులు గుర్తించారు.

మద్యం తాగి...
మద్యం తాగి వాహనం నడపటడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. కారును అతివేగంగా నడపటం వల్ల అదుపుతప్పి అది బైకును ఢీకొందని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News