అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది.

Update: 2024-10-22 12:11 GMT

రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న సమాచారంతో భూపాల్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం ఐదు చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

కీలక పత్రాలను...
దాదాపు నలభై కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా భూపాల్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ భూమి లావాదేవీలో అధికారులకు అడ్డంగా దొరికిపోయిన భూపాల్ రెడ్డి పెద్దయెత్తున, నగదు, ఆస్తి పత్రాలను అధికారులు ఆయన వద్ద స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News