Breaking : సీనియర్ ఐఏఎస్‌‌కు ఈడీ నోటీసులు

సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-10-19 11:40 GMT

 IAS officer amoy kumar

సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోణలను ఆయన ఎదుర్కొన్నారు. భూదాన్ విషయంలోనూ అమోయ్ కుమార్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ పనిచేశారు.

22 లేదా 23 తేదీల్లో హాజరు కావాలని...
మాదాపూర్ మోకిల్లా, శేరిలింగంపల్లి భూముల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. మెదక్ నుంచి అమోయ్ కుమార్ పై ఫిర్యాదులు అందాయి. అయితే ఈ నెల 22, 23వ తేదీల్లో ఈడీ ఎదుటకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News