సూడాన్ లో కూలిన బంగారు గని.. 38 మంది మృతి

సూడాన్ లోని ఒక బంగారు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు

Update: 2021-12-29 02:16 GMT

సూడాన్ లోని ఒక బంగారు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు. బంగారం కోసం ఒక్క సారిగా ఎగబడటంతో ఆ గని కూలిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్ కు 700 కిలోమీటర్ల దూరలంో ఉన్న ఈ గనిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

మూసివేసినా....
ఈ బంగారు గనిని కొంతకాలం ప్రభుత్వం మూసివేసింది. అయినా ప్రజలు బంగారం కోసం ఆ గనిలోకి చొరబడటంతో గని కూలిపోయింది. మూసివేసిన గనిలోకి ప్రవేశించడం, అక్కడ భద్రత లోపాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిపై విచారణకు ఆదేశించింది.


Tags:    

Similar News