బాబోయ్ వరదలు.. 109 మంది మృతి

ఆఫ్రికా దేశం రువాండాలో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 109 మంది మరణించారు

Update: 2023-05-04 12:17 GMT

ఆఫ్రికా దేశం రువాండాలో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రువాండాలోని నదులు, వాగులు పొంగిపొరలుతున్నాయి. జనజీవనం స్థంభించి పోయింది. వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ వరదల కారణంగా 109 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ ఏడాది మొత్తం...
తెల్లవారుజామున వరదలు ముంచెత్తడంతో చాలామంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం తెలిపింది. వరదల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ ఏడాది మొత్తం రువాండాలో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags:    

Similar News