5జీ స్పెక్ట్రమ్ సేల్.. వామ్మో అంతనా..?

5జీ స్పెక్ట్రమ్ సేల్.. వామ్మో అంతనా..?

Update: 2022-07-27 01:48 GMT

భారత్ లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. 72 గిగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం మొదలైంది. తొలిరోజే భారీ స్థాయిలో బిడ్డింగ్ వచ్చింది. మొదటి రోజున బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటింది. భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కోసం ఇంత భారీ వేలం నిర్వహించడం ఇదే ప్రథమం జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ కు చెందిన యాక్టివ్ లీ వంటి సంస్థలు పాల్గొనడంతో తొలిరోజే అద్భుతమైన స్పందన కనిపించింది. తొలిరోజు వేలంలో నాలుగు రౌండ్లు నిర్వహించామని.. బిడ్డింగ్ మొత్తం రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రేపు ఐదో రౌండ్ వేలం చేపడతామని తెలిపారు. ఆగస్టు 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తవుతాయని.. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 600MHz,700MHz, 800MHz,900MHz,1800MHz, 2100MHz, 2300MHz, 3300MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో వేలం జరుగుతుంది.స్పెక్ట్రమ్‌ సిగ్నల్‌ పూర్తిగా అమ్ముడు పోయేవరకు వేలం నిర్వహించనున్నారు. కొన్ని రోజుల పాటు సాగే వేలంలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.

దేశంలో నెక్ట్స్‌ జనరేషన్‌ టెలికం సర్వీస్‌ ప్రారంభించేందుకు 5జీస్పెక్ట్రమ్‌ వేలం మంగళవారం ప్రారంభమైంది. ఈ వేలంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 4.3లక్షల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల పాటు వేలం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ సేవలు ముందుగా ఢిల్లీ,లక్నో,చండీగడ్‌, గురుగ్రామ్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, పుణే నగరాల్లో ప్రారంభం కానున్నాయి. 5జీ ప్రస్తుతం చైనా, అమెరికా, సౌత్‌ కొరియా,బ్రిటన్‌,కెనడా అస్ట్రేలియా,ఇటలీ, సౌదీ అరేబియా,ఫ్రాన్స్‌,స్వీడన్‌ లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. మనదేశంలో కూడా 5జీ సర్వీసుల ట్రయల్‌ను భోపాల్‌, బెంగుళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాలలో నిర్వహిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News