ఆ ఏనుగు ఆస్తి ఐదు కోట్లు

బిహార్ జానుర్‌కు చెందిన అక్తర్ ఇమామ్ తను పెంచుకున్న ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తి రాసిచ్చాడు.

Update: 2023-03-21 07:26 GMT

బిహార్ జానుర్‌కు చెందిన అక్తర్ ఇమామ్ తను పెంచుకున్న ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తి రాసిచ్చాడు. ఆయన రెండు ఏనుగులు పెంచుకుంటున్నారు. ఇటీవల ఓ ఏనుగు చనిపోవడంతో రాణి అనే ఏనుగు ఐదుకోట్ల ఆస్తికి ఏకైక వారసురాలైంది.

ఇమామ్ మరణించడంతో...
తన ఆస్తిని ఏనుగులకు రాసివ్వడం అక్తర్ ఇమామ్ ఫ్యామిలీకి నచ్చకపోవడంతో వారు కొంత ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో అతడు 2021లో హత్యకు గురవ్వడం కొన్ని అనుమానాలకు తావిచ్చింది. అక్తర్ ఇమామ్ చనిపోవడంతో వీలునామా ప్రకారం ఆస్తి రాణి ఏనుగుకు దక్కింది. ప్రస్తుతం రాణి ఏనుగు ఉత్తరాఖండ్ లోని రామనగర్ లో ఓ వ్యక్తి సంరక్షణలో ఉంది.


Tags:    

Similar News