నేడు పుట్టే శిశువులకు బంగారు ఉంగరాలు

శిశువులకు అందించే బంగారపు ఉంగరం బరువు రెండు గ్రాములు ఉండనుంది. కానీ.. ఇది పార్టీకోసం చేసే ఉచితాల స్కీమ్ ..

Update: 2022-09-17 06:31 GMT

మనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. సోషల్ మీడియా వేదికగా.. రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల సీఎంలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. తమిళనాడు బీజేపీ యూనిట్ మోదీ పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తోంది. నేడు పుట్టే శిశువులకు బంగారు ఉంగరాలను పంపిణీ చేయాలని తమిళ బీజేపీ యూనిట్ భావించింది. కానీ.. ఇది ఆ రాష్ట్రమంతా జరగడం లేదు. ఉంగరాలను పంపిణీ చేయడానికి ఆర్ఎస్ఆర్ఎం హాస్పిటల్‌ను ఎంచుకున్నట్టు బీజేపీ రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌కు పార్టీ శ్రేణులు తెలిపాయి.

శిశువులకు అందించే బంగారపు ఉంగరం బరువు రెండు గ్రాములు ఉండనుంది. కానీ.. ఇది పార్టీకోసం చేసే ఉచితాల స్కీమ్ కాదన్నారు. ప్రధాని పుట్టినరోజున జన్మించే శిశువులను స్వాగతించాలని పార్టీ భావిస్తున్నదని, అందుకే ఈ స్కీంను చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఏడాది మోదీ 73వ వసంతంలోకి అడుగుపెడుతుండటంతో.. 730 కిలోల చేపలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో ఈ చేపల పంపిణీ జరగనుంది.



Tags:    

Similar News