Stampede : 107కు చేరిన ఉత్తర్‌‌ప్రదేశ్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య

ఉత్తర్‌ప్రదేశ్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 107కు చేరింది

Update: 2024-07-02 13:07 GMT

ఉత్తర్‌ప్రదేశ్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 107కు చేరింది. రతిభాన్పూర్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. అయితే గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులున్నారు. దాదాపు 150 మందికి పైగా ఈ తొక్కిసలాటలో గాయపడ్డారు.

మోదీ సంతాపం....
కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన విచారణపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిర్వాహకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సత్సంగం జరిగే కార్యక్రమం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌ సభలో మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


Tags:    

Similar News