ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు

Update: 2024-08-15 02:19 GMT

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ వరసగా పదకొండోసారి ప్రధాని హోదాలో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎర్రకోట జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిధులతో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు హాజరయ్యారు. మొత్తం ఆరువేల మంది హాజరయ్యారు.

ప్రపంచానికే...
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు. హర్‌ఘర్ తిరంగా పేరుతో దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయని, దేశంతో కోసం జీవితాలనే పణంగా పెట్టిన ఎందరో మహనీయులున్నారని ప్రధాని మోదీ అన్నారు.


Tags:    

Similar News