సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు

Update: 2024-10-25 02:17 GMT

 sanjeev khanna 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు.సంజీవ్ ఖన్నా ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భారత రాష్ట్రపతి నియామకం చేశారు. సంజీవ్ ఖాన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిిస్ గా వచ్చేనెల 11వ తేదీన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులవుతున్నారు.

వచ్చేనెల 10న
వచ్చేనెల 10వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివైచంద్ర చూడ్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావాల్ ఎక్స్ లో వెల్లడించారు.

Tags:    

Similar News