ఆ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏడ్చేసిన ముఖేష్ అంబానీ

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో అనంత్ అంబానీ

Update: 2024-03-02 10:20 GMT

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో అనంత్ అంబానీ తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాడు. ఆ సమయంలో రిలయన్స్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకోవడం మనం గమనించవచ్చు. ముఖేష్అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మూడు రోజుల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అనంత్ అంబానీ మాట్లాడుతూ.. తనను ప్రత్యేకంగా భావించినందుకు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చిన్నతనంలో అనారోగ్యం కారణంగా తాను పడ్డ కష్టాల గురించి మాట్లాడాడు. ఆ సమయంలో ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనవుతూ, కన్నీటి పర్యంతమయ్యారు.

"నన్ను ఎంతో ప్రత్యేకంగా చూసుకోడానికి నా కుటుంబం చాలా కష్టపడింది. నా జీవితం పూర్తిగా గులాబీల మంచం కాదు. నేను కూడా ముళ్ల బాధను అనుభవించాను. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను, కానీ మా నాన్న, అమ్మ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నేను బాధపడ్డానని ఎప్పుడూ అనిపించలేదు. వాళ్లు ఎప్పుడూ నాకు అండగా నిలిచారు’’ అని అనంత్ అన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ముఖేష్ అంబానీ కుటుంబం కాస్తా ఎమోషనల్ అయింది.
మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు, ప్రపంచంలోని అత్యంత సంపన్నులతో సహా 1,000 కంటే ఎక్కువ మంది అతిథులు హాజరయ్యారు. ప్రముఖ ఆహ్వానితులలో బిల్ గేట్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖ బాలీవుడ్ తారలు ఉన్నారు. శుక్రవారం నాడు, పాప్ స్టార్ రిహన్నా ఈ కార్యక్రమానికి హాజరై.. భారతదేశంలో మొదటిసారిగా ప్రదర్శన ఇచ్చింది.


Tags:    

Similar News