Union Cabinet : ఫోన్లు వస్తున్నాయ్.. వారికే కేంద్ర మంత్రివర్గంలో చోటు

కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కిన వారికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళుతున్నాయి.

Update: 2024-06-09 05:31 GMT

కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కిన వారికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లకు మంత్రిపదవులు ఖాయమయ్యాయి. సాయంత్రం మోదీతో పాటు వీరు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పదవి కేబినెట్ ర్యాంక్ గానూ, పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయకేంద్ర మంత్రి పదవి లభంచనుందని తెలిసింది.

టీడీపీ నుంచి...
వీరితో పాటు మిత్రపక్షాలకు సంబంధించిన నేతలకు కూడా ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. జేడీయూ, జేడీఎస్ నేతలతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈరోజు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. మోదీ తో పాటు దాదాపు ముప్ఫయి మందికి పైగానే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అత్యధికంగా బీజేపీ నుంచి ఎక్కువ మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీనియర్లతో పాటు మరికొందరికి తొలివిడత మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.


Tags:    

Similar News