5జీ సేవలను ప్రారంభించిన మోదీ

దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు

Update: 2022-10-01 05:18 GMT

దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు. భారత్ లోని కొన్ని ముఖ్యమైన నగరాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ 5జీ సేవలు అందుబాటులోకి రాన్నాయి. తర్వాత కాలంలో ఇతర ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనున్నాయి.

13 నగరాల్లో....
భారత్ లోని మొత్తం 13 నగరాల్లోనూ ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో టెలికాం రంగంలో భారత్ కొత్త శకంలోకి ప్రవేశించినట్లయింది. 5జీ సేవలను ప్రారంభించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్ ను కూడా ప్రారంభించారు.


Tags:    

Similar News