Delhi : ఢిల్లీలో భారీ భద్రత .. మొహరించిన పారామిలటరీ బలగాలు

ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో భద్రతను పెంచారు

Update: 2024-06-08 13:17 GMT

ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో వివిధ దేశాలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగే ఈ ప్రమాణస్వీకారానికి దేశ, విదేశాలకు చెందిన అతిధులు హాజరుకానున్నారు.

రేపు సాయంత్రం...
ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మొహరించారు. ఇక రాష్ట్రపతి భవన్‌ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు.


Tags:    

Similar News