గోల్డ్ లవర్స్‌కు ఈరోజు ఓకే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ.300లు పెరిగింది

Update: 2023-04-03 02:16 GMT

బంగారం ధరలు ఎప్పుడూ అంతే. పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అరుదుగా జరుగుతుంది. బంగారం ధరలు పెరుగుతుండటాన్ని చూసి ఇక పసిడిని కొనుగోలు చేయడం కష్టమేనన్న నిర్ణయానికి పేద, మధ్య తరగతి ప్రజలు వచ్చారు. కానీ పెళ్లిళ్ల వంటి వాటికి బంగారు ఆభరణాలు చేయించడం సంప్రదాయంగా వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకం పెంచడం, బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పది గ్రాముల బంగారం 70 వేలకు చేరుకునేందుకు ఎంతో దూరం లేదని కూడా చెబుతున్నారు.

పెరిగిన వెండి ధర...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,000 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,000 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 77,700 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News