KTR : నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్.. అరగంట సేపు స్టేట్‌మెంట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు

Update: 2024-10-23 11:40 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై ఆయన వేసిన పరువు నష్టం దావా కేసులో స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాదాపు అరగంట సేపు ఆయన కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కోర్టులోనే కేటీఆర్ చదివి వినిపించారు. ముందు న్యాయమూర్తి స్టేట్ మెంట్ ఇస్తారా? అని అడగ్గా కేటీఆర్ న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

అసహ్యంగా ఉన్నాయంటూ...
తన వల్లనే నాగ చైతన్య, సమంత విడిపోయారని ఆమె చేసిన వ్యాఖ్యలను కూడా చదివి వినిపించారు. కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా ఆమె చేసిన వ్యాఖ్యలు చెప్పడానికి కొన్ని అసహ్యంగా ఉన్నాయని అన్నారు. అన్ని వివరాలను తాను స్టేట్‌మెంట్ లో ఇచ్చానని కేటీఆర్ తెలిపారు.


Tags:    

Similar News