మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వస్తానంటున్నారు : దానం

తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

Update: 2024-06-21 07:39 GMT

తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పై దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

కేసీఆర్ విధానాలే...
మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నారని దానం నాగేందర్ తెలిపారు. కేసీఆర్ విధానాలే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలు, నిర్ణయాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఎవరి వత్తిడితో కాదని ఆయన తెలిపారు.ఎవరెవరు వస్తున్నారో కూడా ఆయన మీడియాకు పేర్లతో సహా చెప్పారు. 


Tags:    

Similar News