Telangana : తెలంగాణలో 8 మంది ఐపీఎస్ ల బదిలీ

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Update: 2024-07-01 12:09 GMT

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా సుభాశ్ నియమితు లయ్యారు. కొత్తగూడెం ఓఎస్టీగా పరితోష్‌ పంకజ్‌ ను, ములుగు ఓఎస్టీగా మహేశ్ బాబా సాహెబ్‌ ను, గవర్నర్‌ ఓఎస్టీగా సిరిశెట్టి సంకీర్త్‌ నియమితులయ్యారు.

ఉత్తర్వులు జారీ...
భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌ ను భైంసా ఏఎస్పీగా అవినాష్‌ కుమార్‌ ను ప్రభుత్వం నియమించింది. వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డిని, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్‌ ఉపాధ్యాయను నియమిస్తూ ఉత్వర్తులు జారీ అయ్యాయి.


Tags:    

Similar News