Ramoji Rao : రామోజీ పార్ధీవదేహాన్ని మోసిన చంద్రబాబు

రామోజీరావు అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. రామోజీ ఫిలింసిటీలోని స్మృతి వనంలో పార్ధీవ దేహాన్ని తరలిస్తున్నారు

Update: 2024-06-09 05:26 GMT

రామోజీ రావు అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. రామోజీ ఫిలింసిటీలోని స్మృతి వనంలో పార్ధీవ దేహాన్ని తరలిస్తున్నారు. రామోజీ నివాసం నుంచి స్మృతి వనానికి రామోజీ పార్ధీవదేహం చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు పార్ధీవ దేహాన్ని మోసారు. రామోజీ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. ఏపీ నుంచి ముగ్గురు అధికారులు పాల్గొన్నారు.

రెండు రోజుల పాటు...
ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఈ అంతిమ సంస్కార యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈకార్కక్రమంలో పాల్గొన్నారు.


Tags:    

Similar News