తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో జొయిటీస్ సంస్థ తమ కేపబులిటీ సెంటర్ ను విస్తరించాలని భావించింది.

Update: 2024-08-10 07:45 GMT

తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో జొయిటీస్ సంస్థ తమ కేపబులిటీ సెంటర్ ను విస్తరించాలని భావించింది. ఈ మేరకు అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన జొయిటీస్ సంస్థ ప్రతినిధులు కంపెనీ విస్తరణకు అంగీకరించారు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ ఏడాది సెప్టంబరు నుంచి తమ సంస్థ కార్యకలాపాలను మొదలుపెడుతుందని చెప్పారు. ప్రపంచంలోనే ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా జొయిటిస్ కు పేరుంది.

ప్రపంచంలోనే...
హైదరాబాద్ లో నెలకొల్పే ఈ ంస్థ కారణంగా రైతులకు ఉపయోగం చేకూరుతుందని, పాడి పరిశ్రమ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సంస్థ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నివారణ మార్గాలు, చికిత్స వంటి అంశాలపై పరిశోధనలు చేస్తుందని తెలిపారు. వంద దేశాల్లో ఉనన ఈ సంస్థ హైదరాబాద్ లో నెలకొల్పేందుకు ముందుకు రావడం రైతులకు మరింత భరోసా నిచ్చేదిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News