జూదం ఆడుతున్న సీఏ, ఏఎస్సై సహా 13 మంది అరెస్ట్

ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ, ఓ ఏఎస్సై‌తోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

Update: 2023-04-10 05:49 GMT

కొందరు వ్యక్తులతో కలిసి ఒక ఇంట్లో పేకాడుతున్న సీఐ, ఏఎస్సై లను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 7) రాత్రి 13 మందినీ అరెస్ట్ చేయగా.. తాజాగా ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం రాఘవేంద్రనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న కొందరు.. దానిని పేకాట స్థావరంగా మార్చేశారు. ఆ ఇంటిలో పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు పగడ్బందీగా దాడి చేశారు.

ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ, ఓ ఏఎస్సై‌తోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పోలీసులకు పట్టుబడినవారిలో అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ పరమేశ్వరరెడ్డి జ్యోక్యం చేసుకోవడంతో అదే రోజు రాత్రి పట్టణంలోని తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న జోగారావు, కార్పొరేటర్ ఆంజనేయులు, మరో 9 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నాగరాజు, డి.సురేశ్, కె.సురేష్, డి.కిరణ్ కుమార్, పి.కృష్ణారెడ్డి, బి.చెంచుముని, ఎన్.శ్రీనివాసులు, కె.మునిప్రసాద్, కె.రాధాకృష్ణ, కార్పొరేటర్ కె.ఆంజనేయులు, ఎస్.నరేంద్ర, ఏఎస్ఐ జోగారావు, సీఐ చంద్రశేఖర్‌ లు ఉన్నారు. అయినా ఈ కేసులో మరో ఇద్దరు ప్రజాప్రతినిధులను తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News