సెల్లార్ గుంత లో పడి ముగ్గురు చిన్నారుల మృతి

హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుంత లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు

Update: 2021-12-25 03:48 GMT

హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 4 లో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు సెల్లార్ గుంతలో పడి మరణించారు. సంగీత, రమ్మ, సఫియాలు ఈ సెల్లార్ గుంతలో పడి మరణించారు.

భవన నిర్మాణం కోసం....
ఒక భవన నిర్మాణం కోసం ఈ గుంతను తవ్వినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆర్టీఏ ఆఫీసు పక్కన టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. చిన్నారులు ఆడుకునే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటికే ఈ గుంతలో పడి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.


Tags:    

Similar News