ప్రచారం చేసుకుందాం అనుకుంటే షాక్ ఇచ్చారు

Update: 2018-08-23 12:30 GMT

వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి వెళ్లిన ఓ కేంద్ర మంత్రి చేసిన పని విమర్శలకు దారితీసింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్ కేరళలోని ఓ పునరావాస కేంద్రంలో పడుకున్నారు. అయితే, అది గొప్ప విషయంగా భావించిన సదరు మంత్రి ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు కూడా ట్యాగ్ చేశారు. అయితే, ఈ పోస్ట్ తో సదరు కేంద్రమంత్రికి మంచిపేరు రాకపోగా నెటిజన్ల నుంచి షాక్ తగిలింది. ప్రచారానికి ఇది సమయం కాదని ఒకరు, మీకు నిద్ర పడుతోందనేమో కానీ కేరళవాసులకు నిద్ర పట్టడం లేదని మరొకరు, చవకబారు ప్రచార ఎత్తుగడ అని ఇంకొకరు విరుచుకుపడ్డారు.

 

Similar News