ఎక్కడి లారీలు అక్కడే.. 3500 కోట్ల సరుకు?

ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో 3,500 కోట్ల విలువైన వస్తువులు ఏమై పోతాయన్న ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయ్యి లారీలు లాక్ డౌన్ కారణంగా [more]

Update: 2020-04-10 06:57 GMT

ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో 3,500 కోట్ల విలువైన వస్తువులు ఏమై పోతాయన్న ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయ్యి లారీలు లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో నిలిచిపోయాయి. దాదాపు వెయ్యి లారీలు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో చిక్కుకుపోయాయి. దీంతో ఆ లారీల్లో ఉన్న 3,00 కోట్ల సరుకుపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన లారీలను రాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పాటు ఏపీలో డ్రైవర్ల కొరత పట్టిపీడిస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు డ్రైవర్లు విముఖత చూపుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల సరఫరా కష్టంగా మారింది.

Tags:    

Similar News