యోగి మరో కీలక నిర్ణయం.. లాక్ డౌన్ కు?

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసుల పెరుగుతన్నాయి. [more]

Update: 2021-04-17 01:10 GMT

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసుల పెరుగుతన్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు కూడా కరోనా సోకింది. దీంతో యూపీలోని కొన్ని నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. అయినా కేసులు ఆగకపోవడంతో ప్రతి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆదివారం నుంచే ఇది అమలు కానుంది. వారణాసిలో మాత్రం శని, ఆదివారాలు లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News