టీటీడీ ఉద్యోగులకు అండగా ఉంటాం

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 15 మంది ఉద్యోగులు కరోనా కారణంగా మరణించారని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. విధులు నిర్వర్తిస్తూనే [more]

Update: 2021-05-01 00:43 GMT

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 15 మంది ఉద్యోగులు కరోనా కారణంగా మరణించారని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. విధులు నిర్వర్తిస్తూనే వారు కరోనా బారిన పడలేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోనే వారి నివాసం ఉందన్నారు. తిరుమలలో విధులు నిర్వహించేవారందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ చేయిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక వార్డును బర్డ్ ఆసుపత్రిలో కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తిరుమల దర్శనాల పై నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News