ఆ డైలాగులు వెనక్కు తీసుకుంటున్నా

Update: 2018-03-22 12:56 GMT

సినిమా పరిశ్రమపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తాను ఎవరినీ బాధపెట్టాలని అటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారాయన. సినిమా హీరోలు కూడా ఉద్యమంలోకి వస్తే ఊపందుకుంటుందని మాత్రమే తాను అభిప్రాయపడ్డానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయి, బాధ అనిపించి అలా మాట్లాడానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ మొత్తం చంద్రబాబుకు అండగా నిలబడాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. ఎవరినీ బాధపెట్టాలనికాదని, తాను అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈరోజు ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో రాజేంద్ర ప్రసాద్ పై టీడీపీ ఎంపీ మురళి మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. సీని పరిశ్రమపై రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై చిత్రపరిశ్రమలోని కొందరు మండిపడిన సంగతి తెలిసిందే.

Similar News