జగన్, రామోజీ భేటీ

Update: 2017-10-23 14:06 GMT

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. నవంబర్ 2వ తేదీ నుంచి తాను జరపతలపెట్టిన పాదయాత్రపై ఈనాడుసంస్థల గ్రూపు ఛైర్మన్ రామోజీరావుతో జగన్ చర్చించినట్లుతెలిసింది. ఆయన ఆశీస్సులు పొందేందుకే జగన్ రామోజీరావును కలిసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ వెంట వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరెడ్డి ఉన్నారు.

Similar News