జేసీ రాజీనామాపై చంద్రబాబు అసహనం

Update: 2017-09-22 14:25 GMT

చాగల్లుకు నీటి విడుదల అనంతలో రాజకీయ రగడగా మారడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు ఏదైనా సమస్యలు ఉంటే అడిగి చేయించుకోవాలని చెప్పారు. జేసీ దివాకర్‌ సమస్యను గతంలో తనకు కూడా చెప్పారని., ఆ‍యన సమస్య పెద్దది కాదని., ఎవరైనా పద్ధతి ప్రకారం వెళ్లాల్సిందేనని చెప్పారు. నీటి కొరత ఉన్నందున., అందరికి నీళ్లు అవసరం కాబట్టి ప్రాధాన్యతను వివరించి నీటిని వాడుకోవాలన్నారు. జేసీ నీటి సమస్యను తనకు చెప్పినపుడే అధికారులకు తాను ఆ సమస్యను పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు. పులివెందుకు నీళ్లిస్తుంటే వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని చెప్పారు. సొంత ప్రాంతానికి నీరిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటారా అని మండిపడ్డారు.

Similar News