టీడీపీ మాజీ ఎంపీపై లైంగిక వేధింపుల కేసు

Update: 2017-10-28 06:01 GMT

టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుపై కేసు నమోదయింది. లైంగిక వేధింపుల కేసులో ఎంపీ నామాపై కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, అతని సోదరుడు సీతయ్యలు తనను నగ్న చిత్రాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలమే ఈ ఫిర్యాదు వచ్చినా పోలీసులు పట్టించుకోక పోవడంతో ఆ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశం మేరకు మాజీ ఎంపీ పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News