టీడీపీ, వైసీపీలపై టీఆర్ఎస్ ఫైర్

Update: 2018-03-21 01:51 GMT

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ, వైసీపీలు కేంద్రంపై పెట్టిన అవిశ్వాసం పిల్లాట కాదని టీఆర్ఎస్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తాము అవిశ్వాస తీర్మానం చర్చకు అడ్డుపడుతున్నామంటూ ఆంధ్ర ఎంపీలు చేస్తున్న వాదన నిజం కాదని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి తెలిపారు. ఆ రెండు పార్టీలూ రాజకీయ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం పెట్టాయన్నారు. రిజర్వేషన్ల అమలు అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలంటూ తాము పార్లెమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజు నుంచి ఆందోళన చేస్తున్నామన్నారు. పక్కింట్లో పెళ్లయితే...మన ఇంటికి రంగులేసుకుంటామా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. తమపై విమర్శలు చేస్తే సహించబోమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తమతో చర్చించకుండానే అవిశ్వాసం పెడితే ఎలా మద్దతిస్తామని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి తమ నిరసన అడ్డం కాదని వారు స్పష్టం చేశారు.

Similar News