డబ్బు కోసం కాదు.... కేవలం స్నేహం కోసమే!!

Update: 2017-09-18 12:00 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సారి త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన సినిమా జై లవకుశ. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తుండగా.. తమన్నా స్వింగ్ జరా అనే ఐటెం సాంగ్ లో ఆడి పాడింది. మరి హీరోయిన్ గాను ఐటెం సాంగ్స్ స్పెసలిస్ట్ గాను అదరగొడుతున్న తమన్నా కి జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ ని భారీ గా డిమాండ్ చేసింది అని వార్తలు వచ్చాయి. ఎందుకంటే బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శ్రీను సినిమాలో ఐటెం సాంగ్ కి తమన్నా అక్షరాల 60 లక్షలు తీసుకుందనే వార్తలు ఉన్నాయి.

రెమ్యునిరేషన్ బాగానే....

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఐటెం సాంగ్ చేసింది కాబట్టి..... ఈ ఐటెం సాంగ్ కి కూడా తమన్నా భారీగానే తీసుకొని ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అయితే తమన్నాపై వస్తున్నా రూమర్లకు స్పందించిన తమన్నా మాట్లాడుతూ కొన్ని రిలేషన్స్ డబ్బు కంటే ఎక్కువ. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం ట్రీట్ లాంటిది. కాబట్టి ఆ పాటకు ఎంత డబ్బు వస్తుందనే విషయం గురించి నేను అస్సలు పట్టించుకోను. ఎన్టీఆర్ తో నాకు మంచి స్నేహం ఉంది. అలాగే ఇకమీదట మంచి సినిమాలు చేయడంతో పాటు క్రేజీ గా సాంగ్ డిజైన్ చేస్తే గనక ఐటెం సాంగ్ కూడా చేస్తాను అని చెప్పుకొచ్చింది తమన్నా.

ఆఫర్ లేకపోవడం వల్లనేనా?

మరి తమన్నాకి కూడా పరిస్థితి పూర్తిగా అర్ధమైనట్టుంది. ఎందుకంటే... తమన్నాకి ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు. ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా లేదు. అందుకే ఇప్పుడు సినిమాల్తో పాటు ఐటెం సాంగ్స్ కి కూడా సై అనేస్తుంది. మరి సినిమాలో అవకాశాలు లేకపోతె ఇలా ఐటమ్స్ కి ఓటేసినా చేతినిండా సంపాదించొచ్చు కదా తమన్నా ఐడియా బాగానే ఉంది. ఇకపోతే తమన్నా ఐటెం సాంగ్ చేసిన జై లవ కుశ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News