దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రిపై కేసు నమోదు

Update: 2017-09-29 13:31 GMT

విద్యానగర్ లోని దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రి పై కేసు నమోదైంది.రాంనగర్ కు చెందిన మనోహర్ లింగం తన కుమారుడు పదకొండేళ్ల వంశీకృష్ణ కు ఫిట్స్ రావడంతో దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు నిర్లక్షంగా బాలుడికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించడంతో బాలుడు మరింత అనారోగ్యానికి గురయ్యాడు. బాలుడికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించడం పై తల్లిదండ్రులు వైద్యులను నిలదీసినప్పటికీ వారు స్పందించక పోవడంతో బాలుడి మేనమామ శ్రీనివాస్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసారు. దుర్గా భాయ్ దేశముఖ్ హాస్పిటల్ పై ఐపీసీ 336 కింద కేసు నమోదు చేశామని నల్లకుంట సీఐ యాదగిరి రెడ్డి తెలిపారు.

Similar News