ప్రియుడితో గడపాలని ఓ వివాహిత....?

Update: 2017-10-13 02:27 GMT

హత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాపులు... ఇలా ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి వివాహేతర సంబంధాలు. హైదరాబాద్‌లో ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తనే హత్య చేయాలనుకుంది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్చేసింది. కానీ కథ అడ్డం తిరిగింది. ఆమెతోపాటు ప్రియుడు జైలు పాలయ్యాడు.వివాహేతర సంబంధం మోజులో పడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలనుకున్న కిలాడీ లేడీ జైలుపాలైంది. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన జ్ఞానేశ్వర్‌, సునీత దంపతులు హైదర్‌గూడలో నివాసం ఉంటున్నారు. జ్ఞానేశ్వర్ టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అతని భార్య సునీత సోమాజీగూడలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. తన సంస్థలో పనిచేసే శ్రీనివాస్‌తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

నిద్రమాత్రలిచ్చి మరీ.....

కొంతకాలంగా శ్రీనివాస్‌ను గుట్టుగా కలుస్తోంది సునీత. అయితే తమ బంధానికి భర్త జ్ఞానేశ్వర్‌ అడ్డుగా ఉన్నాడని భావించింది. భర్తను చంపేస్తే... శ్రీనివాస్‌తో కలిసి జీవితాంతం ఉండొచ్చనుకుంది. భర్త హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన జ్ఞానేశ్వర్‌కు సునీత నిద్రమాత్రలిచ్చింది. స్పృహకోల్పోయిన జ్ఞానేశ్వర్‌ను ఆటో డ్రైవర్ వెంకటేష్‌ సాయంతో... ఆటోలో కీసర అటవీ ప్రాంతానికి బయల్దేరారు. అయితే దారిలోనే జ్ఞానేశ్వర్‌కు స్పృహ రావడంతో... తప్పించుకొని ఈ నెల ఏడున నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో భార్యే భర్తను హత్య చేయించేందుకు స్కెచ్‌ వేసినట్టు తేలింది. భర్తను చంపాలనుకున్న భార్య సునీతతో పాటు ఆమె ప్రియుడు శ్రీనివాస్‌ను, వారికి సహకరించిన ఆటో డ్రైవర్ వెంకటేష్‌ను చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News