బీటెక్ చదువుతూ.... ఈ విద్యార్థికి ఏమైంది?

Update: 2017-10-13 03:48 GMT

విద్యార్థులకు ఏమవుతుంది. ఉన్నత చదువుల కోసం కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు కనిపించకుండా పోతున్నారు. ఒకరోజులో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య ఘటన మర్చిపోకముందే మరొక విద్యార్థి అదృశ్యం కావడం పై చర్చగా మారింది. హైదరాబాదులో మరొక విద్యార్థి అదృశ్యమయ్యాడు. బీటెక్ చదువుతున్న విద్యార్థి రెండు రోజుల నుంచి కనిపించలేదు. కాలేజీకని ఇంటి నుంచి వెళ్లిన రెడ్డి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెళ్ళి ఎల్బీ నగర పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మధ్యకాలంలో వరుస విద్యార్థుల కనిపించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతుంది. ఎల్బీ నగర్లో ఉంటున్న విద్యాసాగర్ కుమారుడు స్వాతిక్ రెడ్డిని బుధవారం ఉదయం తండ్రి విద్యా సాగర్ కాలేజ్ దగ్గర దిగబెట్టి వచ్చాడు. తన కుమారుడు కాలేజీ కి వెళ్లాడని భావించి తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు. రాత్రి వరకు కూడా స్వాతిక్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో అతని మిత్రులను వాకబు చేసాడు తండ్రి విద్యాసాగర్ రెడ్డి . గురువారం ఉదయం వరకూ రెడ్డి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మిస్ అయిన సాత్విక రెడ్డి ని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు పోలీసులు.

Similar News