బ్రేకింగ్ : కీలక భేటీ ప్రారంభం

Update: 2018-03-05 14:02 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రణాళిక సంఘం ఛైర్మన్ కుటుంబరావులు హాజరయ్యారు. వీరు అరుణ్ జైట్లీతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విభజన హామీల అమలు, రెవెన్యూ లోటు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Similar News