కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టుకొ ట్టి వేసింది. రైతాంగం పక్షాన నిలబడిన తమకు విజయం లభించిందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. పిటిషన్ ను కొట్టివేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ధర్మం, న్యాయమే గెలిచిందని చెప్పారు.