లోక్ సభ ప్రారంభమయిన కొద్దిసేపటికే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టారు. దీంతో సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. అన్నాడీఎంకే సభ్యులు కావేరీ జలాలపైన, టీఆర్ఎస్ సభ్యులు రిజర్వేషన్ల అంశంపై ఆందోళనకు దిగారు. దీంతో సభ గంటపాటు స్పీకర్ వాయిదా వేశారు.