మత్తులో మగువలు...!

Update: 2018-02-17 07:58 GMT

చుక్కేసి.. చిందేసి..మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతులు...!

పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టి కారు స్టీరింగ్ పట్టిన మగువలు....!

ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన యువతులు....!

జూబ్లీహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ముగ్గురు యువతులు.....!

మద్యంమత్తులో మగువలు రెచ్చిపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్డు నెంబర్ 45లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు ముగ్గురు యువతులు. పబ్బుల్లో ఫుల్లుగా మద్యం తాగిన యువతులు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కారు స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. రాంగోపాల్ పేట్ కు చెందిన శ్రావణి AP 28 DQ 2695 నెంబరు గల కారును తాగిన మత్తులో నడుపుతూ పోలీసులకు చిక్కింది. శ్రావణికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా..74 పాయింట్లు మద్యం మోతాదు ఉన్నట్టు నమోదైంది. సికింద్రాబాద్ కు చెందిన మీనల్ అనే యువతి తప్పతాగి AP 10 Q 1249 నెంబరు గల కారును నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. గచ్చిబౌలికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరైన స్నేహాల్ అనే యువతి మందుకొట్టి TS 08 EM 5886 నెంబరు గల కారును నడుపుతూ దొరికింది. స్నేహాల్ ను బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా మద్యం మోతాదు 76 పాయింట్లుగా నమోదైంది. ముగ్గురు యువతులపై కేసులు బుక్ చేసి.. అమ్మాయిల కార్లను సీజ్ చేశారు పోలీసులు..తాగిన మత్తులో తమ బాయ్ ఫ్రెండ్స్ ను మీడియాపై ఉసిగొల్పారు మందుభామలు. దీంతో రెచ్చిపోయిన బాయ్‌ప్రెండ్స్‌... మీడియా ప్రతినిధుల్ని దుర్భాషలాడారు. కెమెరాను లాక్కునేందుకు ప్రయత్నించాడు ఓ మందుబాబు. ఫ్యామిలీస్ ఉన్నాయని.. మీ చెల్లెలైతే అలానే చేస్తారా అంటూ దాడికి యత్నించారు. తిట్ల దండకం అందుకున్న ఓ తాగుబోతుని అదుపులోకి తీసుకుని.. పోలీస్ వ్యాన్ ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.👇

Similar News