మరదలిని హత్యచేసిన బావ

Update: 2017-10-07 05:21 GMT

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది ....షాపూర్ నగర్ లో టీఎస్ ఐఐసి కాలనీలో నివాసం ఉంటున్న సౌమ్య నిన్న కాలేజి కి వెళ్తానిని చెప్పి ఇంటినుంచి వెళ్లింది ...కాని తిరిగిరాలేదు..అయితే దీనిపై సౌమ్య తల్లి సునీత జీడిమెట్ల పోలీస్టేషన్ లో తనకూతురు కాలేజ్ కని వెళ్లి ఇంతవరకూ ఇంటికి రాలేదని ...తమ బంధువు వరుసకి బావ అయ్యే క్రిష్టయ్య పైన తనకు అను మానం ఉందని కేసునమోదు చేసింది ...కట్ చేస్తే నిన్న సాయంత్ర కూకట్ పల్లి పోలీస్టేషన్ లో ఓ వ్యక్తి లొంగిపోయాడు ...తానే మరదలిని చంపానని శవాన్ని ఐడియల్ చెరువులో పడేశానిని పోలీసులు ఎదుట చెప్పాడు ..తన పేరు కృష్టయ్య అని తన మరదలు సౌమ్యను అనుకోకుండా చంపేశానని చెప్పాడు ...దీంతో సంబధిత పిఎస్స్ కు సమాచారం అదించిన పోలీసులు అక్కడ మిస్సింగ్ కేసు నమోదు అవడంతో కేసును జీడిమెట్ల పోలీసులుకు అప్పగించారు...తనకి సౌమ్యకి మధ్య గొడవ జరిగిందని కంగారులో కొట్టానని, ఆమె అక్కడికక్కడే చనిపోయిందని, ఏం చేయాలో తెలియక ఓ కవర్ లో కట్టి చెరువులో పడేశాని పోలీసులకు తెలిపాడు నిందితుడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News