మినిస్టర్ మాణిక్యాలరావు....రెండు ఆప్షన్లు...!

Update: 2018-02-19 10:43 GMT

అధిష్టానానికి రెండు ఆప్షన్లు ఇచ్చామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ప్రస్తుతం టీడీపీతో పొత్తు తెంచుకునే ఆలోచనలో లేమన్నారు మంత్రి మాణిక్యాలరావు. అదే సమయంలో టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగానష్టం ఏదీ లేదన్నారు. అరుణ్ జైట్లీని బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్రానికి తెచ్చి ఏపీకి ఏమిచ్చామో తెలియజేయాలని అధిష్టానానికి తెలిపామన్నారు. అరుణ్ జైట్లీ సమాధానంతో ఏపీ ప్రజలు సంతృప్తి పడతారన్నారు. ఒక్క ఏపీలోనే మిత్రపక్షంగా టీడీపీతో కొనసాగుతున్నామన్నారు. పంజాబ్ లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన బీజేపీతో పొత్తు తెంచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తాము మంత్రివర్గం నుంచి వైదొలగడమనేది అధిష్టానంచేతిలో ఉందన్నారు. అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామన్నారు మాణిక్యాలరావు.

Similar News