ముంబైలో విషాదం ; 15 మంది మృతి

Update: 2017-09-29 06:52 GMT

ముంబైలో విషాద ఘటన జరిగింది. ముంబయి ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి పదిహేను మంది మృతి చెందారు. దాదాపు యాభై మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి రెయిలింగ్ పై దూకేందుకు కొందరు ప్రయత్నిసుండగా బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో పదిహేను మంది మృతి చెందారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి బలహీనంగా ఉండటం వల్లనే కూలిపోయిందంటున్నారు. భారీ వర్షం కురుస్తుండటంతో రైల్వే స్టేషన్లోకి పరుగులు ఎక్కువ మంది పరుగులు తీయడం వల్లనే ఈ సంఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయల్ మరికొద్దిసేపట్లో పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు.

Similar News