రేవంత్ రెడ్డికి షాక్

Update: 2017-10-20 10:34 GMT

రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలోని టీడీపీ నేతలంతా టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వారు కాసేపట్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి చేరతారన్న వార్తలు వస్తుండటంతో కొడంగల్ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఆయన వెంట వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. మద్దూరుకు చెందిన జడ్పీటీసీ, గ్రామ సర్పంచ్ తో పాటు దాదాపు మూడు వందల మంది కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. రేవంత్ రెడ్డి త్వరలోనే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 9వ తేదీన పాదయాత్రచేపట్టాలని నిర్ణయించారు. అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో రేవంత్ రెడ్డి తన ఇంట్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు.

Similar News