వైసీపీ కార్యాలయంలో వీరంగం

Update: 2017-10-16 08:38 GMT

అనంతపురం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి వర్గీయులు వీరంగం సృష్టించారు. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. తమ నేత గురునాధ రెడ్డిని పక్కన పెట్టారంటూ ఆయన అనుచరులు విధ్వంసం సృష్టించారు. రేపు వైసీపీ అధినేత జగన్ అనంతపురం జిల్లాకు రానున్నారు. ధర్మవరం లో జరుగుతున్న చేనేత కార్మికుల దీక్షలకు జగన్ సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిధున్ రెడ్డి అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే వైసీపీ నేత అయిన గురునాధరెడ్డి అనుచరులు కార్యాలయంలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే గురునాధ రెడ్డిని వైసీపీ పక్కన పెట్టడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు టీడీపీలోకి చేరడం ఖాయమైనట్లే. ఇటీవల జగన్ అనంతపురంలో జరిపిన యువభేరికి కూడా గురునాధరెడ్డి హాజరుకాలేదు. అయితే తాజాగా వైసీపీ కార్యాలయంలో గురునాధరెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు.

Similar News